PS Telugu News
Epaper

యూపీ పాఠశాలల్లో వార్తా పత్రికల పఠనం తప్పనిసరి ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు

📅 29 Dec 2025 ⏱️ 2:50 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

విద్యార్థుల రోజువారీ కార్యకలాపాల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మార్గదర్శకాలు జారీచేసింది. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను చూసే సమయాన్ని తగ్గించి, పుస్తక పఠన సంస్కృతిని బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాల గ్రంథాలయాల్లో ఆంగ్ల, హిందీ వార్తాపత్రికలను అందుబాటులో ఉంచాలని ఈ నెల 23న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రతిరోజూ ఉదయం విద్యార్థుల్ని సమావేశపరిచే సమయంలో కనీసం పది నిమిషాల సమయాన్ని వార్తాపత్రికల పఠనానికి కేటాయించాలని స్పష్టంచేసింది.ఈ సమయంలో వంతులవారీగా విద్యార్థులు వార్తాపత్రికల్లోని ప్రధాన వార్తలను, సంపాదకీయాల్లో ముఖ్యాంశాలను, జాతీయ/ అంతర్జాతీయ/ క్రీడావార్తలను చదివి వినిపిస్తారు. ‘నేటి పదం’ రూపంలో వార్తాపత్రికల నుంచి అయిదు క్లిష్టమైన పదాలను గుర్తించి, నోటీసు బోర్డుపై రాయాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థుల పదజాలం మెరుగవుతుంది.వార్తాపత్రికలను చదవడం వలన విజ్ఞానం పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు

Scroll to Top