PS Telugu News
Epaper

రసవత్తరంగా ముగిసిన సీనియర్స్ కబడ్డీ టోర్నమెంట్..

📅 25 Feb 2026 ⏱️ 6:45 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 25 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడి పోటీల్లో మొదటి బహుమతి గా వెలిగండ్ల ఆదినారాయణ, దాసరి రామచంద్ర,సుబహాన్ బద్దలరాముడు,లక్ష్మణ్ నాయక్ స్పాన్సర్ చేసిన 50000/- లను బెంగళూరు జట్టు గెలుచుకోగా రెండవ బహుమతి గా తిరం పురం నీలకంఠ, గుండా నారాయణస్వామి, గన్నె రమేష్ వెలిగండ్ల ఉపేంద్ర స్పాన్సర్ చేసిన 40000/- ప్యాపిలి జట్టు, మూడో బహుమతిగా లక్ష్మీ ప్రసన్న జ్యువెలర్స్ ఓనర్ నీలూరు చంద్రశేఖర్ స్పాన్సర్ చేసిన 30 వేల రూపాయలను తమిళనాడు జట్టు,నాలుగో బహుమతిగా గంగవరం రవితేజ మరియు ముత్తూట్ మనీ గంగాధర్, భాస్కర్ రెడ్డి స్పాన్సర్ చేసిన 20000 రూపాయలను యాడికి జట్టు గెలుచుకున్నాయి…అంపైర్లను మరియు క్రీడాకారులు ఆడటానికి అనుగుణంగా మ్యాట్స్ స్పాన్సర్ చేసిన జనసేన సునీల్ ని కప్పులు అందజేసిన పారడైజ్ స్కూల్ యాజమాన్యాన్ని,భోజన వసతిని కల్పించిన లియో క్లబ్ (విశ్వం &రఘు )వారిని, టీషీర్ట్స్ ధాత మణి ని,అలాగే ప్రైజ్ మనీ అందజేసిన దాతలను కమిటీ సభ్యులు,కూటమి నాయకులు ఘనంగా సన్మానించారు…

Scroll to Top