PS Telugu News
Epaper

రాయలచెరువు లో ఎరువుల దుకాణాలలో విజిలెన్స్ అధికారులు తనిఖీ

📅 20 Sep 2025 ⏱️ 6:22 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 శర్మాస్ వలి మండల రిపోర్టు యాడికి

రాయలచెరువులోని పలు ఎరువుల దుకాణాలను విజిలెన్స్ మరియు వ్యవసాయ అధికారులు తనిఖీలు చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో భాగంగా న్యూ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, భాస్కర ఫర్టిలైజర్స్ దుకాణాలలో ఎరువులను వాటి రికార్డులను పరిశీలించడం జరిగినది.న్యూ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణంలో రికార్డులు సరిగా లేని రూ.1,85,000 ఎరువులకు అమ్మకపు నిలిపివేత ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. యూరియా కృత్రిమ కొరత సృష్టించిన, MRP కంటే ఎక్కువ అమ్మిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విజిలెన్స్ డీఎస్పీ యం.నాగభూషణం, విజిలెన్స్ ఏవో వాసు ప్రకాష్, విజిలెన్స్ ఎస్ ఐ నరేంద్ర భూపతి, మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా పాల్గొన్నారు.

Scroll to Top