రుద్రూర్ లో ఇందూర్ సునీత- ఇందూర్ చంద్రశేఖర్ గెలుపుఖాయం…
రుద్రూర్, డిసెంబర్ 9 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
స్థానిక ఎన్నికల్లో భాగంగా రుద్రూర్ లో రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. అటు పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గం.. ఇటు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం, మరో వైపు బీజేపీ పార్టీ పోటాపోటీగా మారాయి. సర్పంచ్ బరిలో ఇందూర్ సునీత- ఇందూర్ చంద్రశేఖర్ గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఇందూర్ చంద్రశేఖర్ గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నారని ప్రజలు అంటున్నారు. మంగళవారం బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఉర్దూ అకాడమీక్ చైర్మన్ తాహెర్ బీన్ అందన్ రాకతో రాజకీయాల్లో కొత్త మార్పులు వచ్చాయి. ఏది ఏమైనా రుద్రూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఇందూర్ సునీత- చంద్రశేఖర్ గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థి ఇందూర్ సునీత – ఇందూర్ చంద్రశేఖర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.