రైతు సేవా కేంద్రాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం
పయనించే సూర్యుడు డిసెంబర్ 16 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం మాముడూరు,తూర్పుపల్లిరైతు సేవా కేంద్రం నందు మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. హేమ బిందు మాట్లాడుతూ, రైతులందరూ వరి నారుమడి లో జింకు లోపం ఉన్నట్లయితే చిలెట్ జింకు 12% స్ప్రేయార్ చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా వరిపంట వేసిన ప్రతి ఒక్క రైతులకు ఎకరాకి మూడు యూరియా బస్తాలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఈకార్యక్రమంలో ఏ ఈ ఓ సుజాత , వి ఏ ఏ. విజయ రైతులు తదితరులు పాల్గొన్నారు
