PS Telugu News
Epaper

వైభవంగా గణనాధుని నిమజ్జనం.!

📅 01 Sep 2025 ⏱️ 6:59 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

హాజరైన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్,డైరెక్టర్,కమిషనర్ సునీత రెడ్డి

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 1 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

గత అయిదు రోజులుగా విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన గణనాధుడు విశేష పూజలందుకుని,సోమవారం నిమజ్జణానికి బయలుదేరారు.ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ లతో కళాశాల కరస్పాండెంట్ విశ్వనాధ్,ప్రిన్సిపల్ భవాని శంకర్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని బొబ్బిలి చెరువులో నిమజ్జనం కోసం తరలించారు.ఈ నిమజ్జన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కరుణాకర్ తో పాటు కళాశాల లెక్చరర్స్ రాఘవేందర్,రవీందర్,కృష్ణ,మున్సిపల్ నాయకులు,యువకులు తదితరులు ఉన్నారు…

Scroll to Top