PS Telugu News
Epaper

వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం.

📅 06 Jan 2026 ⏱️ 6:55 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 06,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

*గోస్పాడు, నంద్యాల జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ సహాయ సంచాలకులు చెన్నయ్య, ఆళ్లగడ్డ సహాయ సంచాలకులు విజయ శేఖర్ ఆధ్వర్యంలో యాలూరులో రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు సాగు విషయంలో రసాయన ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడకం పెంచాలని దీనివల్ల ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాలు అందించవచ్చు అని తెలిపారు, అలాగే భూసార పరీక్షల వల్ల కలిగే ప్రయోజనాలు, రైతులకు వారి పొలంలో పోషక విలువలను వివరించారు. భూసార పత్రాలను అందజేశారు. రైతుల పొలంలో భాస్వరం అధికంగా ఉందని సేంద్రియ కర్భనం తక్కువ ఉందని వివరించారు. మరియు రబీ పంట నమోదు రైతులందరూ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో డిఆర్సి వెంకటేశ్వర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి స్వప్నిక రెడ్డి,ఆత్మ ఏటీఎం హరిబాబు, వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

Scroll to Top