PS Telugu News
Epaper

శాంతి యుత వాతావరణంలో దుర్గామాత ఉత్సవాలు జరుపుకోవాలి…

📅 23 Sep 2025 ⏱️ 4:12 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రుద్రూర్, సెప్టెంబర్ 23 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :

రుద్రూర్ మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ లో మంగళవారం రుద్రూర్ ఎస్సై సాయన్న శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. శాంతియుతమైన వాతావరణంలో దుర్గామాత ఉత్సవాలు జరుపుకోవాలని అన్నారు. దుర్గామాత ఊరేగింపులో డీజే బాక్సులు పెట్టవద్దని, విద్యుత్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల దుర్గామాత కమిటీ నిర్వాహకులు, మాలధారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top