సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.
నిర్మల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 16 న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక సదర్మాట్ బ్యారేజీని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి బుధవారం బ్యారేజీ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్, ప్రారంభోత్సవ వేదిక, భద్రతా ఏర్పాట్లు, బ్యారేజీ గేట్లను పరిశీలించారు.బ్యారేజీ ఆయకట్టు రైతాంగ కల సాకారమవుతున్న తరుణంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, ఎమ్మెల్యే , డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు, కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, నీటిపారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు
