సేవే లక్ష్యం… గ్రామాభివృద్ధే గమ్యం
గుడ్ మార్నింగ్ అంటూ తెల్లవారుజామునుంచే ప్రచారం,
అలుపు సలుపు లేని చలాకీ తనం సదర్ లాల్ సొంతం
పయనించే సూర్యుడు, డిసెంబర్ 4, అశ్వాపురం,
ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే, సమస్యలు ఓపికగా విని, పరిష్కారం కోసం పరిగెత్తే వ్యక్తి అయిన సదర్ లాల్ అని పార్టీకి కాదు ప్రజలకు ఉపయోగపడే నాయకుడిగా ముందుకొచ్చారు అని ఊరూ వాడ కొనియాడుతున్న కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలు బలపర్చిన అశ్వాపురం సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్.అశ్వాపురం గ్రామంలో ప్రతి ఇంటికి తెలిసిన నాయకుడు, అభివృద్ధికి కట్టుబడి ఉన్న వ్యక్తి,చిన్న ,పెద్ద అని తేడా లేకుండా అందరిని తల్లి, చెల్లీ, అన్న , బాబాయ్ అని అందరికీ అందుబాటులో ఉండే మనిషి. పేదల కోసం, వృద్ధుల కోసం, యువత కోసం నిజంగా పని చేసిన సేవా తత్పరత గ్రామానికి కావలసిన నిధులు పథకాలు తెచ్చే సామర్థ్యం ఉన్న అనుభవజ్ఞుడు అని అశ్వాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్ ని, ఈ నెల పదకొండో తేదీన జరుగుతున్న ఎన్నికల్లో ఫుట్ బాల్ గుర్తు కి ఓటు వేసి అఖండ మెజారిటీ తో గెలిపించాలని కోరుతున్నారు.తెలంగాణా రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసన సభ్యులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మరియు డి సి సి బి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య గారి ఆదేశాలతో గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.ప్రలోభాలకు లొంగొద్దని పనిచేసే నాయకుడిని స్వార్థం లేని నాయకుడిని ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత,వార్డు అభ్యర్థులు వేములపల్లి అశ్రిత,కొమరం కౌసల్య,గుర్రం త్రివేణి, చిట్టూరి భాస్కర్, నూకల లింగయ్య,సవలం అనిల్,నాయకులు వేములపల్లి రమేష్, షేక్ ఖధీర్,బూతం వెంకటేశ్వర్లు,తాడబోయిన వెంకటేశ్వర్లు,వలబోజు మురళీకృష్ణ, టీ డీ పి వాసు,ఇలాసాగరపు వరప్రసాద్, హరీష్, చుంచు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
