స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో బి.ఆర్.అంబేద్కర్ కు ఘన నివాళి
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 6 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి : స్టార్ పారడైజ్ హైస్కూల్లో రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. దేశం గర్వించేదగ్గ మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని స్టార్ పారడైజ్ హై స్కూల్ మేనేజ్ మెంట్ రంగ, ఇలాహి, నాగేంద్ర తెలిపారు. బి ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం యాడికి లోని స్టార్ పారడైజ్ హైస్కూల్ లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి అని తెలిపారు. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు,సమ న్యాయం కల్పించడంలో బి ఆర్ అంబేద్కర్ పాత్ర చిరస్మరణీయమని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుమాంజలి, కుమారి, కృష్ణవేణి, పరమేష్,పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.