PS Telugu News
Epaper

హమ్మయ్య… తుఫాన్ మలుపు మార్చింది! ఏపీ సేఫ్ అంటున్న వాయుగుండం కేంద్రం

📅 26 Nov 2025 ⏱️ 11:59 AM 📝 ఆంధ్రప్రదేశ్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఏపీకి తుపాను ముప్పు తప్పింది. మలక్కా జలసంధి ప్రాంతంలో బలపడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. తుపానుకు సెనియార్‌గా నామకరణం చేశారు. అయితే, 24గంటల తరువాత తుపాను క్రమంగా బలహీన పడుతుందని, బంగాళాఖాతంలోనే బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.మలక్కా జలసంధి, దానికి అనుకొని ఉన్న ఈశాన్య ఇండోనేషియా సమీపంలో సెనియార్ తుపాను కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మలక్కా జలసంధిపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గత ఆరు గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దాదాపు పశ్చిమ దిశగా కదిలి.. తుపాను సెనియార్ గా మారింది. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఇండోనేషియాను సెనియార్ తుపాను దాటనుంది. దీంతో భారతదేశానికి.. ఏపీకి సెనియార్ ముప్పు తప్పిందని వాతావరణ శాఖ పేర్కొంది.

Scroll to Top