50 లక్షల రూపాయలతో వంతెన నిర్మాణానికి భూమి పూజ చేసిన మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్
{పయనించే సూర్యుడు} {ఏప్రిల్14 మాగనూరు }
మాగనూరు మండలం తాళంకేరి మరియు నేరడగం దొడ్డి.మధ్యన ఉన్న బ్రిడ్జి భూమి పూజ మంత్రి వాకిటి శ్రీహరి.ఆదేశానుసారం 50 లక్షల రూపాయలతో వంతెన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది కర్ణాటక చివర్లో ఉన్న గ్రామాలను మంత్రి. బ్రిడ్జి నిర్మిస్తున్నందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నాయకులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా మంత్రి వాకిటి శ్రీహరి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.. ఇంటి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, మాజీ ఎం పి పి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కట్ట. సూరయ్య , మండల కాంగ్రెస్ పార్టీ నేత శివరాం రెడ్డి, నేరడగం దొడ్డి సర్పంచ్ వెంకటేష్, ఉపసర్పంచ్ కాజా, తలంకేరి సర్పంచ్ శ్రీమతి పోలమ్మ& నర్సింలు, ఉప సర్పంచ్ శ్యామ్, వర్క్ రు సర్పంచ్. లక్ష్మప్ప, దొడ్డి సలీం , రాజు, బసవరాజ్, రామకృష్ణ, మరియు కాంట్రాక్టర్ నాగిరెడ్డి, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

