పోడు భూమి పట్టాలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని రాస్తారోకో ధర్నా

Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 04/09/25 గాంధారి మండల కేంద్రంలో

పోడు భూమి పట్టాలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని రాస్తారోకో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు మోతిరాం నాయక్ కార్యదర్శి ప్రకాష్ నాయక్ అఖిలపక్షం నాయకులు శంకర్ నాయక్ రవీందర్ నాయక్ బి శంకర్ నాయక్ దేవి నాయక్ వసంత్ నాయక్ అమర్ సింగ్ నాయక్ గణేష్ నాయక్ సంతోష్ నాయక్ రమేష్ నాయక్ లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఉద్దేశించి మాట్లాడుతూ భూములకు రుణాలు ఇవ్వాలని ఆరు మాసాల నుంచి బ్యాంకుల చుట్టూ కలెక్టర్ల చుట్టూ తిరిగిన ఫలితం రాలేకపోయింది పంట పెట్టుబడి కోసం దళారులకు అశ్రయించి మూడు రూపాల వడ్డీతో పేద రైతులు నష్టపోతారు అయినా బ్యాంక్ అధికారులు పట్టింపు లేకుండా పోయిందని అన్నారు వెంటనే బ్యాంకు మేనేజర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ వారం రోజుల్లోనే మీకు రుణాలు అంతే విధంగా చూస్తానని మాట చెప్పడం జరిగింది ఒకవేళ వారంలో ప్రారంభించక పోతే కామారెడ్డి జిల్లా కలెక్టర్ ను దిగ్భంధం చేస్తామని నాయకులు తమ డిమాండ్ పత్రాన్ని బ్యాంకు మేనేజర్ ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పోడు రైతులు కూలీలు పాల్గొన్నారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top