PS Telugu News
Epaper

లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ.

📅 15 Sep 2025 ⏱️ 2:24 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ 15(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)

యాడికి మండల పరిధిలోని పెద్ద పేట గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన తెలుగుదేశం నాయకులు, రెవిన్యూ అధికారులు
ఈ సందర్భంగా మాజీ ఎం.పీ.పీ .వేలూరు రంగయ్య మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కొత్త పథకాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నామని తెలిపారు. “దీపం” పథకం, “తల్లికి వందనం”, “స్త్రీ శక్తి”, “అన్నదాత సుఖీభవ” వంటి పథకాల ద్వారా మహిళలు, రైతులు, పేద కుటుంబాలందరికీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. ఇప్పుడు అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు ద్వారా మరింత పారదర్శకతతో, వేగవంతంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు లబ్ధిదారుల దాకా చేరుతాయని పేర్కొన్నారు. “ఆర్థికంగా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, అభివృద్ధి,సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రుద్రమ నాయుడు, మాజీ ఎంపీపీ వేలూరి రంగయ్య, దడియాలా ఆది, తహసిల్దార్ ప్రతాపరెడ్డి, మరియు రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Scroll to Top