PS Telugu News
Epaper

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి వినతి పత్రము అందజేసిన భీంగల్ కాంగ్రెస్ నాయకులు

Listen to this article

యనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మున్సిపల్ పరిధిలో ఈరోజు శుక్రవారం రోజున

భీమ్గల్ మండల అధ్యక్షుడు బొదిరే స్వామి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెడిపోయిన భీమ్గల్ నుండి బడా భీమ్గల్ రోడ్డును కప్పల వాగుపై వున్న వంతెనను మరమత్తు కు నిధులు మంజూరు చేయించి పనులు త్వరగా ప్రారంభించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి వెంటనే నిధులు మంజురు చేసి 10 రోజుల్లో పనులు ప్రారంభించాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య,మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, వాక మహేష్,భూషన్ తదితరులు పాల్గొన్నారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top