Tuesday, September 23, 2025
Homeఆంధ్రప్రదేశ్సావిత్రిబాయి పూలే 62 వ ట్యూషన్ సెంటర్ ప్రారంభం

సావిత్రిబాయి పూలే 62 వ ట్యూషన్ సెంటర్ ప్రారంభం

Listen to this article

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 21 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )

వేమనవి జ్ఞాన కేంద్రం మరియు విశ్వ మానవ సంక్షేమ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న సావిత్రిబాయి పూలే 62 వ ట్యూషన్ సెంటర్ ను ఈరోజు శ్రీధనమల్లి గ్రామంలో విశ్వమానవ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మస్తాన్ రావు ప్రారంభించారు.ఈ సంధర్బంగా మస్తాన్ రావు మాట్లాడుతూ సమాజంలో ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను,సహాయగుణం,కుల,మతాలకతీతంగా అందరితో కలిసిమెలసి స్నేహపూర్వకంగా మెలగాలని,ఆత్మస్థైర్యం తో జీవించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్ఎం చంద్రశేఖర్ వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మల్లారపు నాగార్జున ,మెడికల్ ఆఫీసర్ టి.రవీంద్ర కుమార్ టీచర్ పుల్ల నాగరాజు , డమాయి ప్రభాకర్ , డమాయి వెంకయ్య ట్యూషన్ టీచర్ ప్రసన్నకుమారి,విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments