Wednesday, September 24, 2025
Homeతెలంగాణఐఎఫ్టియు ఆధ్వర్యంలోసింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు నల్ల బ్యాడ్జీల తో నిరసన

ఐఎఫ్టియు ఆధ్వర్యంలోసింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు నల్ల బ్యాడ్జీల తో నిరసన

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, రామగిరి-24 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల్లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరిగిందనీ ఎస్ సి సి డబ్ల్యూ యు- ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం అర్జీ 3లో కాంట్రాక్ట్ కార్మికులు నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలియజేశారు.(ఎస్ ఓ టు జి ఎం) రామ్మోహన్ కి ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరిగింది అన్నారు. సింగరేణి సంస్థకు వచ్చిన 6094 కోట్ల లాభాల్లో కాంట్రాక్టు కార్మికుల శ్రమ ఉంది సింగరేణి కాంటాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు.పర్మినెంట్ కార్మికులకు 1,95,610 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను 5500/- ప్రకటించడం అంటే కాంటాక్ట్ కార్మికులను మోసం చేయడమే సింగరేణిలో గుర్తింపు సంఘం ప్రాతినిత్య సంఘలు కాంట్రాక్ట్ కార్మికులకు ఏమాత్రం లాభాల వాటా పెంచడానికి ప్రయత్నం చేయలేదు. ఏదైనా చేస్తే మేమే చేయాలి అంటూ కాంట్రాక్ట్ కార్మికుల దగ్గరికి వచ్చి మీటింగ్ లు పెట్టే ఏఐటీయూసీ, ఐఎన్టియుసి నాయకులు కాంట్రాక్టు కార్మికుల పక్షాన ఎందుకు మాట్లాడడం లేదన్నారు. కనీసం పదివేల రూపాయలైనా ఎందుకు ఇప్పించలేదో కాంటాక్ట్ కార్మికులకు సమాధానం చెప్పాలనీ అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు 20వేల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు పి రమేష్, పి రాజనర్స్, జి నర్సయ్య, పి మొండయ్య, అంజమ్మ, ఎం ఓదెలు, ఎన్ శ్రీనివాస్, అజయ్, జి లింగయ్య, సుధాకర్. తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments