Friday, October 24, 2025
Homeఆంధ్రప్రదేశ్గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్స్ కు పాత పద్ధతిలోనే జిల్లాకలెక్టర్ గెజిట్...

గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్స్ కు పాత పద్ధతిలోనే జిల్లాకలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలుచెల్లించాలి

Listen to this article

తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎట్టి ప్రశాంత్ డిమాండ్.

పయనించే సూర్యుడు అక్టోబర్ 10 (పొనకంటి ఉపేందర్ రావు )

టేకులపల్లి మండల పరిధిలో గంగారం ఆశ్రమ పాఠశాల వర్కర్లు చేస్తున్న రిలే దీక్ష 29వ రోజు చేరుకున్న సందర్భంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎట్టి ప్రశాంత్ సంపూర్ణ మద్దతు తెలిపి, మాట్లాడుతూ..వర్కర్లకు ఇప్పుడు చెల్లిస్తున్న విదంగానే జిల్లా కలెక్టర్ కనీస వేతనాల సర్క్యులర్ (గెజిట్) ప్రకారం యధావిధిగా వేతనాలు చెల్లించాలి, గతంలో టి ఆర్ యస్ ప్రభుత్వం కాలంలో 2021 జూన్ 15 న ఆర్థిక శాఖ విడుదల చేసిన జి.ఒ 64 ను అమలు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసారని, దీని ఫలితంగా వర్కర్ల వేతనాలు బాగా తగ్గుతున్నాయి,జి.ఓ.64 నిలిపివేయాలని . అదేవిధంగా 212 జి.ఒ ను సవరించి 2014 నాటికి 5 సంవత్సరాల సర్వీస్ వున్న వారందరిని పర్మి నెంట్ చేస్తూ, మిగిలిన వర్కర్లకి టైంస్కేల్ ఇవ్వాలి జీఓ నెం.64తో భారీగా వేతనాలు తగ్గిపోయి కార్మికుల జీవితాలు బారంగా మారాయి .పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచవలసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా 2021లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీఓ నెం.64ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయటం వలన కార్మికుల వేతనాలు నెలకు రూ॥ 4 వేల నుండి 16 వేలవరకు తగ్గుతున్నాయి,ఈ పద్ధతి సరి కాదు,ఔట్సోర్సింగ్ విదానం రద్దు ,పెండింగ్ వేతనాలు చెల్లించుటకు ట్రేజరీలకు తగు ఆదేశాలు ఇవ్వాలి గత సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలి,కొత్త మెనూ వల్ల పెరిగిన పనిభారానికి అనుకుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలి,పూర్తికాలం పనిచేస్తున్నకార్మికులకుపూర్తివేతనాలు చెల్లించాలి,మరణించిన కార్మికుల కుటుంబసభ్యులను డైలీవేజ్ వర్కర్లుగా నియమించాలి,విధ్యార్థులతో పాటు కార్మికులకు కూడా 2 జతల యూనిఫాం మరియు ఐడి కార్డులు ,12 నెలలకు వేతనాలు (దసరా సెలవులు, సంక్రాంతి,వేసవిసెలవెలకుకూడాచెల్లించాలి,10 లక్షల ప్రమాద భీమా కల్పించాలి,రిటైర్మెంట్ బెన్ఫిట్ రూ॥ 5 లక్షలు ఇవ్వాలని,మట్టి ఖర్చులకు రూ॥ 50 వేలు ,వేతనంతోకూడిన వారాంతపు సెలవులు అమలు చేయాలని కొరారు.సెప్టెంబర్ 12 నుండి ప్రారంభం అయిన నిరవధికసమ్మె29రోజులుగాM,ద్వాలీ,E,సీతమ్మబిజ్జ లక్ష్మయ్య, కోరం, సమ్మక్క, కంగల , సరిత, జోగ ముత్తమ్మ కొనసాగుతున్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments