Sunday, October 19, 2025
Homeఆంధ్రప్రదేశ్ఈతకు వెళ్లి వ్యవసాయ కళాశాల విద్యార్థి మృతి

ఈతకు వెళ్లి వ్యవసాయ కళాశాల విద్యార్థి మృతి

Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్ 11 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న

నంద్యాల జిల్లా మహానంది మండలం ఎం సి ఫారం గ్రామంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న జనార్ధన్ నాయక్ అనే విద్యార్థి ఈతకు వెళ్లి మృతి చెందినట్లు సమాచారం. కళాశాల సెలవు దినం కావడంతో విద్యార్థులు పాలేరు వాగు వద్దకు సుమారు పదిమంది కలిసి బట్టలు ఉతికి, ఈత కొట్టేందుకు వెళ్లి అస్వస్థకు గురయ్యాడని స్థానికులు పేర్కొన్నారు. తోటి విద్యార్థులు గమనించి బయటకు తీసి కళాశాల అధికారులకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్సులో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోని మృతి చెందినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న మహానంది పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments