
పయనించే సూర్యుడు, అక్టోబర్ 14( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్
రేపు తేదీ 15-10-2025 రోజున 33/11 కేవీ లక్ష్మీపూర్ సబ్ స్టేషన్లో నిర్వహించే మెంటెనెన్స్ పనుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగనుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ నిలిపివేయబడుతుంది. ఈ సమయంలో లక్ష్మీపూర్, అంకుశపూర్, పాపాయిపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. వినియోగదారులు ఈ అసౌకర్యాన్ని సహనంతో స్వీకరించి, సహకరించ గలరని విద్యుత్ శాఖ అధికారులు అభ్యర్థించారు.