PS Telugu News
Epaper

యువత గంజాయి, మాదపద్రవ్యాలకు దూరంగా ఉండాలి..

📅 18 Nov 2025 ⏱️ 6:42 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రుద్రూర్, నవంబర్ (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :

రుద్రూర్ మండల కేంద్రంలోని ఆహార సాంకేతిక కళాశాలలో మంగళవారం ఎస్సై సాయన్న గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలన పై అవగాహన కల్పించారు. అదేవిధంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. యువకులు గంజాయి, మాదకద్రవ్యాల వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, పోలీసు సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top