టేకులపల్లి మండలంలో పర్యటించిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య
పయనించే సూర్యుడు నవంబర్ 20 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి:అనారోగ్యంతో మరణించినగంగారం (ప), సిద్దారం(గ్రా) మాజీ MPTC కొర్స ఈశ్వరయ్య గారి తండ్రి,బర్లగూడెం మాజీ సర్పంచ్ పూనెం మోహనరావు తల్లి,కొప్పురాయి AMC డైరెక్టర్ జార సమ్మక్క అత్తగారు ఇటీవల కాలంలో స్వర్గసతులైనందున నేడు వారి నివాసాలకు వెళ్లి వారి చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటనలో భాగంగా బర్లగూడెం (ప) మొట్లగూడెం గ్రామం నందు నిర్మాణలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలనీ,ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్ళు లేని నిరుపేదలకు అండగా నిలుస్తూ అర్హులైన ప్రతీ ఒక్క కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా ప్రభుత్వం అందిస్తుందని,ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా నిలవాలని కోరుతూ లబ్దిదారులకు పలు సూచనలు చేశారు బోడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసారు, ఉపాధ్యాయుల బోధన మరియు మెనూ గురించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకుకొని ఏమైన సమస్యలు ఉంటె తమ దృష్టికి తీసుకురావాలని , అందరూ మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ గారు, S. I రాజేంధర్ గారు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పోశాలు, కుంజా వీరభద్రం, మూతి కృష్ణ, భూక్యా సర్దార్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు