PS Telugu News
Epaper

గండిలచ్చపేటలో విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ

📅 22 Nov 2025 ⏱️ 5:33 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు, నవంబర్ 22( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్


తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో వరదల వల్ల దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ పోల్స్‌ను పునర్నిర్మాణం చేసి మళ్లీ విద్యుత్ సరఫరాను ప్రారంభించామని సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు తెలిపారు. ఈ పనులకు మొత్తం రూ.2,50,000 వ్యయం చేసినట్లు వెల్లడించారు.గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. రైతులు నాసిరకం మోటార్లు ఉపయోగించకుండా, నాణ్యమైన మోటార్లను వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో సెస్ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Scroll to Top