PS Telugu News
Epaper

భైంసా పట్టణంలో పలు సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ జాదవ్ సంతోష్ కు వినతి పత్రం

📅 09 Dec 2025 ⏱️ 2:22 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి

కిసాన్ గల్లీలో, గట్టు మైసమ్మ గల్లీలో, గోపాల్ నగర్ గల్లీలో నెలకొన్న విద్యుత్ దీపాలు పాడైపోయిన సమస్య గోపాల్ నగర్ హనుమాన్ మందిరం ముందర లైట్ ఫోల్ నంబర్ GNT/2-26,GNT/2-27 గల రెండు ఫోల్లకు విద్యుత్ దీపాలు పాడైనాయి, అలాగే కిసాన్ గల్లీలో కూడ విద్యుత్ దీపాలు పాడైపోయయని ఆఫోల్ల నంబర్ PGT/1-33,RRT/9, కిసాన్ గల్లీ, నేతాజీ నగర్ హనుమాన్ మందిరం ముందర గల గల సెంట్రల్ లైటింగ్స్ విద్యుత్ దీపాలు పాడైపోయయని నూతన విద్యుత్ దీపాలను అమర్చలని అలాగే కిసాన్ గల్లీ, గట్టు మైసమ్మ గల్లీ, గోపాల్ నగర్ గల్లీలలో మిషన్ భగీరథ పైపులు పగిలి నీరు రోడ్డుపై పారుతుంటే పాఠశాలలకు వెళ్ళే చిన్నారులకు ఇబ్బంది కరంగా మారింది అలాగే మురికి కాలువలపై సిసి బెడ్డ్లు పాడై గుంతగ మారయని అలాగే పురాణ బజార్ దాస్ హనుమాన్ మందిరం ముందర మిషన్ భగీరథ వృదాగ పోతున్నాయని నూతన కుళాయిని ఏర్పాటు చెస్తే ఉదయం పూట హనుమాన్ మందిరానికి వచ్చే భక్తులకు నీళ్ళు ఉపయోగపడతాయని పలు సమస్యల గురించి కాసరోల్ల ప్రవీణ్ మున్సిపల్ ఇంజనీరింగ్ గారికి వివరించి తొందరగా ఈ సమస్యలు నివారించి చెప్పడంతో వారు సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే సమస్యల పరిష్కారం చెపడుతామని హమీ ఇచ్చారు.ఈ సమస్యలు పరిష్కరించండి అని బండారి దిలిప్,కారగిరి గోవర్దన్,చొప్పరి వెంకటేష్,బాచ్చోల్ల మధు,అమెడ శేఖర్,అక్షయ్,వినయ్,గాలి వినయ్,పృద్వీరాజ్ పాల్గోన్నారు.

Scroll to Top