రుద్రూర్ గ్రామ సర్పంచ్ కు ఘన సన్మానం..
రుద్రూర్, డిసెంబర్ 13 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన ఇందూరు సునీత-ఇందూరు చంద్రశేఖర్ దంపతులు శనివారం శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారి విజయాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ, శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. సర్పంచ్ దంపతులకు శాలువా, పూలమాలలతో శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.