PS Telugu News
Epaper

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కాకతీయ మరియు వరద కాలువ మరమ్మత్తుల కొరకు 32 కోట్ల 55 లక్షల 60 మంజూరు.

📅 30 Dec 2025 ⏱️ 7:35 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్

బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్

గత ప్రభుత్వంలొ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మరమ్మత్తులకు నోచుకోక ప్రభుత్వం నిధులు మంజూరు చేయక దాని మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గారు అన్నారు. ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం ప్రాజెక్టు, కాకతీయ మరియు వరద కాలువ మరమ్మత్తుల కొరకు 32 కోట్ల 55 లక్షల 60 రూపాయలను తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల శాఖ వారు మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందని అన్నారు *కాకతీయ కెనాల్ 0 కిలోమీటర్ల నుండి 25 కిలోమీటర్ల వరకు వివిధ మరమ్మత్తులకు కొరకు 2 కోట్ల 30 లక్షలు *వరద కెనాల్ గాండ్లపేట్ వద్ద పడిన గండి పూడ్చడానికి 8 కోట్ల 52 లక్షలు ఎస్ ఆర్ ఎస్ పి ఎర్త్ డ్యాం వద్ద వివిధ పనుల కొరకు 89 లక్షల 60 వేలు *డ్యాం వద్ద మేజర్ పనుల కొరకు 18 కోట్ల 27 లక్షల 50 వేలు *ప్రాజెక్టు గేట్ల వద్ద ఎలక్ట్రికల్ కేబుల్స్ మరియు వివిధ పనులకు 2 కోట్ల 56 లక్షల 50 వేలు మంజురు కావడం జరిగిందని తెలిపారు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి సహకరించిన సుదర్శన్ రెడ్డి కి ముత్యాల సునీల్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు

Scroll to Top