PS Telugu News
Epaper

వివాహ వార్షికోత్సవాని పురస్కరించుకొని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ పంపిణీ అందజేత

📅 05 Jan 2026 ⏱️ 5:23 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

(పయనించే సూర్యుడు జనవరి 5 రాజేష్ దౌల్తాబాద్)

దౌల్తాబాద్ మండలం తాజా మాజా జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు తిరుమలాపురం గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమలాపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బండలు మరియు దౌల్తాబాద్ మండలం ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గడ్డం నాగరాజు వారు మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులు మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని వారు అన్నారు. భవిష్యత్తులో పిల్లలు ముందుకు పై చదువులకు వెళ్లాలని వారు అన్నారు . ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలాపురం సర్పంచ్ బండారి లాలు. ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గడ్డం నాగరాజు. ఉపాధ్యాయులు మరియు తాజా మాజీ ఎంపీటీసీల పురం అధ్యక్షుడు బండారి దేవేందర్ తిరుమలాపూర్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మార గౌని రమేష్ గౌడ్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top