PS Telugu News
Epaper

ఏపీ స్టేట్ మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు మత్స్యకార గ్రామ పర్యటన…

📅 08 Jan 2026 ⏱️ 7:21 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 8 ముమ్మిడివరం ప్రతినిధి

నారా చంద్రబాబు నాయుడు వారు ఆదేశం మేరకు 

అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామం మత్స్యకారులతో నాయకులతో సమావేశం అయి వారి సమస్యలు తెలుసుకొని మత్స్యకార సమస్యలు తీర్చే విధంగ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి తద్వారా ముఖ్యమంత్రి  వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సమస్యలు అన్ని పరిష్కరిస్తామని అలాగే ఆదరణ-3 పథకం ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని ఉపయోగించుకుని మత్స్యకారులు ఆర్థికంగా స్థిరపడాలని కోరారు అలాగే ఇక్కడ గ్రామస్తులు కమ్యూనిటీ హాల్, వలలు, జెట్టి నిర్మాణం, నెట్ మేకింగ్ సెంటర్, అలాగే బోటు రిజిస్ట్రేషన్లు చేయించాలని కోరారు, ఇంటర్మీడియట్ వరుకు గురుకుల పాఠశాల కట్టించాలని కోరారు. పల్లం గ్రామం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరిస్తారని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్, స్టేట్ సెక్రటరీ నాగిడి నాగేశ్వరావు గారు, ఇల్లింగి వెంకట రమణ, పార్టీ ప్రెసిడెంట్ మల్లాడి రామకృష్ణ, దండుప్రోలు సత్యం, దండుప్రోలు బాలయ్య, గ్రామ పెద్ద బొమ్మిడి లింగేశ్వరరావు, సంఘాని వెంకటేశ్వర్లు, పెమ్మాడి వెంకటేశ్వరరావు మల్లాడి గోవిందు ఓలేటి శ్రీను, పెమ్మడి శ్రీను మల్లాడి శాసయ్య, గ్రామ పెద్ద అవనిగడ్డ దాసు, ఆకుల రాంబాబు, పాలిపి మహేష్, పాలిపి శ్రీరాములు, కప్పడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top