PS Telugu News
Epaper

కేంద్ర బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ వెంకటరెడ్డినూతన బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకి ఊరట

📅 05 Feb 2026 ⏱️ 7:11 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 5 2026 ముమ్మిడివరం ప్రతినిధి

బడ్జెట్-2026 లో మధ్యతరగ ప్రజలు, వేతన జీవులకు కీలక ఊరట లభించనుందని బీజేపీ ముమ్మిడివరం మార్కెటింగ్ యార్డ్ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేసారు. దేశ చరిత్రలో తొలిసారిఆదివారం రోజున కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ సీతారామన్ వరుసగా 9వసారి యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టి రికా సృష్టించారని, కొత్త పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు పరిమితిని లక్షల నుంచి 4 లక్షలకు పెంచగా, స్టాండర్డ్ డిడక్షన్ను 1 లక్షకు పెంచారని, దీనితో సంవత్సరానికి 1 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఆదాయపు పన్ను నుంచి పూర్తిగా విముక్తి పొందనున్నారని ఆయ అన్నారు. ఆరోగ్య రంగంలో క్యాన్సర్ వంటి వ్యాధులకు ఉపయోగించే 36 రకాల ప్రాణరక్షక మందుల కస్టమ్స్ డ్యూటీ రద్దు చేశారని, మొబైల్ ఫోన్లు, లిథియం-అయాన్ బ్యాటరీల తయారీ విడిభాగాల సుంకాలు తగ్గించడంతో ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రిక్ వాహనాలు చౌకయ్యే అవకాశం ఉందని, తోలా పాదరక్షల పరిశ్రమలో 22 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు పథకం ప్రకటించగా, మౌలిక సదుపాయా అభివృద్ధికి 12.6 లక్షల కోట్లను కేటాయించారని అలాగే వచ్చే రెండేళ్లలో 40 వేల రైల్వే బోగీలను వం భారత్ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించనున్నారని వెంకటరెడ్డి ఈ నూత బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తం చేసారు.

Scroll to Top