ఒక యూనిట్ రక్తం మూడు ప్రాణాలను కాపాడుతుంది(బ్లడ్ బ్యాంక్)
ఎమ్మెల్యే దాట్ల – రక్తదానం మహాదానం
పయనించే సూర్యుడు, ఫిబ్రవరి ,6 ముమ్మిడివరం ప్రతినిధి
ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు జన్మది నాన్ని పురస్కరించుకొని మురమళ్ళ బైం జు ఫౌండేషన్ ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరా నికి నియోజకవర్గ ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ అమూల్యమైన రక్తాన్ని దానం చేయడం, నాయకుడిపై ప్రజలు చూపిస్తున్న అపారమైన అభిమానానికి ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ సుమారు 180 మంది రక్తదానం చేసి ప్రాణాలను కాపాడే మహ త్తర సేవలో భాగస్వాములు కావడం
గర్వకారణం. రక్తదానం అనేది కేవలం వైద్య అవసరాన్ని తీర్చడం మాత్రమే కాదు, అది మనిషి మనిషికి చేసే అత్యంత గొప్ప సేవ. ఒక యూనిట్ రక్తం మూడు ప్రాణా లను కాపాడగలదు. అందుకే రక్తదానం మహాదానం అని అంటారు. నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న ఈ ప్రేమ, ఆదరణ, నమ్మకం మరింత బాధ్యతను పెంచు తుంది. ప్రజల సేవే పరమావధిగా భావిస్తూ, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలనే సంకల్పాన్ని ఇది మరింత బలపరుస్తుంది. ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి రక్తదాతకు, సేవా సంస్థలకు, నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞ తలు ఈ కార్యక్రమంలో దాట్ల పృధ్వి రాజు ,దాట్ల పవన్ ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి ,మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, మార్కెటింగ్ చైర్ పర్సన్ ఓగూరి భాగ్యలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహ రావు, గొలకోటి దొరబాబు, పొద్దోకు నారాయణరావు, గొల్ల కోటి వెంకటరెడ్డి, మోకా బాల ప్రసాద్, బీమాల సూరిబాబు, అర్ధాన్ని శ్రీనివాసరావు, చిక్కాల అంజిబాబు,సాగిరాజు సూరిబాబు రాజు, కాకర్లపూడి రాజేష్, విమ్మితి చిరంజీవి,నడింపల్లి సుబ్బరాజు, రంబాల రమేష్, గ్రంధి నానాజీ ,గుద్దటి జమ్మి, నూకల దుర్గ బాబు ,యాళ్ల ఉదయ్, మట్ట సూరిబాబు, మట్ట సత్తిబాబు, బొంతు నాగరాజు, సత్తి నూకరాజు, అడబాల సతీష్ కుమార్, కుంచనపల్లి నారాయణరావు, కుంచె శ్రీను, దాట్ల బాబు, డేవిడ్ రాజ్, బద్రి రమాదేవి, నడిమింటి సూర్య ప్రభాకర్ రావు, గొల్లపల్లి గోపి, మండలాల పార్టీ అధ్యక్షులు కూటమి పార్టీ నాయకులు కూటమి నేతలు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
