సిద్దాపూర్ సర్పంచ్ బాసు నాయక్ ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన సర్పంచ్ బాసు నాయక్
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో నూతన సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్ ఆధ్వర్యంలో గ్రామసభను ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం సిద్దాపూర్ గ్రామంలో మరియు చింతగట్టు తండాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించడం జరిగింది అనంతరం సర్పంచ్ బాసు నాయక్ మాట్లాడుతూ.. సిద్దాపూర్ గ్రామపంచాయతీ ని ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు. గ్రామపంచాయతీ అభివృద్ధిలో యువకులు గ్రామస్తులు తమ సలహాలు సూచనలు అందించాలని కోరారు. గ్రామపంచాయతీ పరిధిలోని ఉన్న ప్రతి సమస్యను ప్రజలతో మరియు గ్రామ పెద్దలతో కలిసి పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో విస్లావత్ బాసు నాయక్ మరియు పంచాయతీ కార్యదర్శి ఖాజా, ఉప సర్పంచ్ దొబ్బల యాదయ్య వార్డు సభ్యులు కయ్యుం, ఒడ్డే శివానంద్, మల్లేశ్, కవితా, స్రవంతి, జ్యోతి,పిప్పల గణేష్, కిషన్, దిబ్బల జ్యోతి,
