PS Telugu News
Epaper

దాతల సహకారంతో విద్యార్థులకు వాటర్ బాటిల్స్ అందజేసిన ప్రధానోపాధ్యాయులు: కశెట్టి.జగనే

📅 13 Feb 2026 ⏱️ 1:24 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

. జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 13

ఈరోజు జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి లీటర్ వాటర్ బాటిల్ మరియు బిస్కెట్ ప్యాకెట్లు అందించడం జరిగింది. మార్కాపురం వాస్తవ్యులు గోళ్ళ హరీష్ కుమార్ మొదటి కుమార్తె షంయుక్త జన్మదినం సందర్భంగా జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు, రానున్నది ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కరికి బ్రాండెడ్ వాటర్ బాటిల్ మరియు బిస్కెట్ ప్యాకెట్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఎక్కడో కర్ణాటకలో బిజినెస్ చేస్తూ నా పిలుపుమేరకు వారి పాప పుట్టినరోజు సందర్భంగా ఏమి ఇవ్వాలని వారు అడగ్గా పిల్లలకు వాటర్ బాటిల్ ఇస్తే ఉపయోగపడుతుందని చెప్పగానే వెంటనే ఏర్పాటు చేశారు. వారి గొప్ప మనసుకు అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ సమాజంలో తమ వంతుగా ఏదో ఒక సహాయం చేస్తూ ఉండడం మంచి విషయం. ఇలాగే ప్రతి ఒక్కరు ప్రేరణ పొంది మీ వంతుగా సహాయ సహకారాలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Scroll to Top