ప్రకృతి చికిత్సలయాన్ని సందర్శించిన ఉపాధ్యాయులు..
రుద్రూర్, ఫిబ్రవరి 27 పాయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి ) :
రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలోని ప్రకృతి చికిత్సలయాన్ని గురువారం కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ మండలాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్యం యోగ మానసిక ప్రశాంతత ఆరోగ్యకరమైన ఆహారం వంటి అంశాలపై నిర్వాహకుల ద్వారా అవగాహన చేసుకున్నారు. వివిధ ఆరోగ్య సమస్యలపై యోగా గురువు డాక్టర్ సాయిలు సందేహాలు తీర్చారు. ఈ కార్యక్రమంలో నసరుల్లాబాద్ మండల విద్యాధికారి డి చందర్, కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్లు నూతి పల్లి బాల రాజ్ రామ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు