యూత్ కాంగ్రెస్ చీఫ్ అరెస్ట్
అక్రమ కేసుకలు భయపడేది లేదు
నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు
మేకల ప్రమోద్ రెడ్డి.
పయనించే సూర్యుడు న్యూస్ నకిరేకల్ ఫిబ్రవరి 27.
నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి నాయకత్వంలో, యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు శ్రీ ఉదయ్ బాను చిబ్ ని మరియు ఇతర యువజన కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా అమెరికాతో ప్రధాని నరేంద్ర మోడీ చేసుకున్న ట్రేడ్ ఒప్పందం భారతదేశ రైతులకు నష్టం కలిగించే విధంగా ఉందని ఆరోపిస్తూ, ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి, “అమెరికాకు లొంగిపోయిన ప్రధాని” అంటూ (“PM Compromised”) వంటి నినాదాలతో ప్రజాస్వామ్య హక్కులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకులను అరెస్ట్ చేయడం యువత గొంతును నొక్కివేయాలనే కుట్రపూరిత చర్య అని వారు మండిపడ్డారు.నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి నాయకత్వంలో, రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బట్టే సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో నకిరేకల్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఏనుగు రఘుమా రెడ్డి, నార్కట్పల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా పృధ్వీరాజ్, నకిరేకల్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ కమిటీ సభ్యులు, ఆయా మండలాల కమిటీ సభ్యులు మరియు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.ప్రజాస్వామ్య విలువలను తక్షణమే గౌరవించాలని, రాజకీయ కక్షసాధింపులను నిలిపివేయాలని యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం మరింత ఉత్సాహం, దీక్షతో కొనసాగుతుందని హెచ్చరించారు

