గంగవరం రత్నం శెట్టి వారి ఆధ్వర్యంలో అన్నదానం
పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 4 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి శ్రీ లక్ష్మీ భూదేవి సమేత చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎద్దులు బండలాగుడు పోటీలకు గుర్రపు స్వారీ చూడడానికి వచ్చిన స్వామివారి భక్తులకు రైతు సోదరులకు కీర్తిశేషులు గంగవరం రత్నం శెట్టి వారి కొడుకులు మనవళ్ళు దాదాపుగా వెయ్యి మందికి పైగా అల్పాహారము ప్రతి సంవత్సరం లాగానే ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ఉదయమే ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీధర్ జీఎస్టీ రవితేజ పవన్ రాజా రూపేష్ రాజు వెంకట్ డాక్టర్ నవీన రాజేశ్వరి కీర్తి రాకేష్ తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు

