PS Telugu News
Epaper

విప్లవపంథా కోసం చివరిదాకా పోరాడిన విప్లవయోధుడు కామ్రేడ్ రాయల రవన్న.

📅 05 Mar 2026 ⏱️ 4:20 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

మార్చి 10 నాడు హైదరాబాదులో జరిగే రాయల 10వ సభను జయప్రదం చేయండి.

ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ పిలుపు
భారత దేశంలో దేశ పరిస్థితులకు అనుకూలంగా సరి అయినా పంథా, విప్లవపంథా కోసం చివరిదాకా పోరాడిన విప్లవయోధుడు కామ్రేడ్ రాయల రవన్న అని,కామ్రేడ్ రవన్న స్పూర్తితో బలమైన విప్లవోధ్యమాలను నిర్మిద్దాంఅని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ పిలుపును*. ఇచ్చారు. గురువారం నాడు సిపిఎంఎల్ ాస్ లైన్( ప్రజా పంథా) రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ నాయకుడిగా సుధీర్గకాలంగా రహస్యంగా పని చేసి మృతి చెందిన అమరుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్(రవి) అన్న వర్ధంతి సభ పోస్టర్స్ సిరికొండ మండలం లోని గడ్కోల్ గ్రామంలో ఆవిష్కరణ చేశారు ఈ సందర్బంగా . * సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ* కామ్రేడ్ రాయల రవన్న 40 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపి భారత దేశ భౌతిక పరిస్థితులకు అనుగుణంగా విప్లవపంథా ఉండాలని విప్లవకారులు ఐక్యంగా పనిచేయాలని తన చివరిదాకా ఊపిరి ఉన్నంతకాలం విప్లవోద్యమ నాయకుడిగా పని చేశారన్నారు. భారత దేశ సమకాలిన పరిస్థితులకు అనుగుణంగా ప్రజాపంథా లైన్ ను మరింతగా బలపరచుకొని ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత కామ్రేడ్ రాయల గారి స్ఫూర్తితో మరింత ఉత్తేజంతో విప్లవోద్యమాలను మరింతగా ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. పిడివాద తదితర ధోరణులను ఎదుర్కొని బలమైన ప్రజా ఉద్యమ నిర్మాణానికి విప్లవ సైనికులంతా పూనుకోవాలని పిలుపునిచ్చారు. విప్లవోద్యమ నిర్మాత, ఆదర్శ కమ్యూనిస్టు అమరుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవన్నల పదో వర్ధంతి సభను ఈ నెల 10వ తేదీన హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్నది ఈ సభకు విప్లవ శ్రేణులంతా అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఇంకా ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ లైన్ (ప్రజాపంథా)రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, నిజామాబాద్ రూరల్ జిల్లా నాయకులు ఆర్ రమేష్ , డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి బాబన్న, బి కిశోర్, ఏ అనిస్, ఎం సాయిరెడ్డి,మండల నాయకులు ఎం లింబాద్రి, ఎం నారగౌడ్, ఇ రమేష్, జె బాల్ రెడ్డి, పి రమ, ఆర్ పుష్పలత, స్వప్న, ఎస్ కిశోర్, ఎల్ నరేష్, కె ఆశిస్, ఎస్ ఆశన్న, టీ పోషన్న తదితరులు పాల్గొన్నారు

Scroll to Top