అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి
బూర్గులలో ఇందిరమ్మ ఇల్లుకు శంకుస్థాపన
(పయనించే సూర్యుడు ఏప్రిల్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బూర్గుల గ్రామానికి చెందిన పూలే జ్యోతి అరుణ్ కుమార్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కమ్మరి నర్సింలు మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పరశురాం పుల్లని జగన్ పుల్లని జంగయ్య మరియు పెద్దింటి రాము, సాయి కృష్ణ పుల్లని యాదయ్య పుల్లని అరుణ్ శ్రీకాంత్ బైండ్ల గిరి పోలే జంగయ్య పుల్లని లక్ష్మయ్య చెన్నయ్య భాస్కర్ తదితరులు పాల్గొన్నారు