PS Telugu News
Epaper

భీంగల్ పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారి కనుగోలు కేంద్రం

📅 28 Apr 2026 ⏱️ 8:02 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించి సూర్యుడు 28 ఏప్రిల్ 20 26 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్

పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లారీల కొరత ఉండడం వలన లారీ కొరత లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. రైస్ మిల్లులతో మాట్లాడి వరి లోడైన లారీలను తొందర తొందరగా ఖాళీ చేసి కొన్ని కొనుగోలు కేంద్రాలకు పంపేలా చూడాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. రైతులతో మాట్లాడి లారీల కొరత లేకుండా చూస్తామని అన్నారు. దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయాలని రైస్ మిల్ యజమానులకు ఫోన్లో మాట్లాడి కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది సార్ వెంట మెప్మా సిబ్బంది ఉన్నారు

Scroll to Top