ఆంధ్రప్రదేశ్లో కొత్త ‘రైతన్నా’ కార్యక్రమం ప్రారంభం: నేటి నుంచి రాష్ట్రవ్యాప్త అమలు
పయనించే సూర్యుడు న్యూస్ :నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ”రైతన్నా.. మీకోసం” కార్యక్రమం ప్రారంభం కానుంది. మొత్తం ఏడు రోజులపాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఈ నెల 24 నుండి 29 వరకు ప్రతి రైతు ఇంటికి వ్యవసాయ అధికారులు వెళ్లనున్నారు. రైతుల సమాచారాన్ని సేకరించడంతో పాటు, వారికి పలు సూచనలు చేయనున్నారు వ్యవసాయ అధికారులు. సాంప్రదాయంగా వస్తున్న పంటలను కాకుండా.. నూతన పంటల వైపు అడుగులు వేసేలా అన్నదాతలను సిద్ధం చేయనున్నారు. […]




