అబ్దుల్లాపూర్ మోక్ష కర్ర గణపతిని దర్శించుకున్న మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి

September 19, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో కొలువుదీరిన మోక్ష కర్ర గణపతిని మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గ్రామానికి చేరుకున్న సందర్భంగా గ్రామస్థులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గణపతి సన్నిధిలో గణనాథుని ఆశీస్సులు తీసుకొని . గణేష్ ఉత్సవాల సందర్భంగా గ్రామంలో నెలకొన్న భక్తి వాతావరణాన్ని చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ బాయి మాజీ ఎంపీపీ లలిత. భోజన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఆసమ్ మాధవ్ గైక్వాడ్ సాయినాథ్ అబ్దుల్లాపూర్ గ్రామస్థులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విఠల్ రెడ్డిని గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

🌐 Select Language:
📰 ePaper