డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి జన్మదిన సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ.

September 10, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడుD.10.9.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలను బీజేపీ భీమ్‌గల్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.జన్మదిన వేడుకలను కేవలం ఆర్భాటాలకు పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాలకు వేదికగా మార్చుతూ, భీమ్‌గల్ పట్టణంలోని వివిధ ఆసుపత్రులను బీజేపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా బీజేపీ భీమ్‌గల్ మండల పార్టీ అధ్యక్షులు ఆరే రవీందర్ మాట్లాడుతూ, “డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి రాజకీయ ప్రస్థానం పదవుల కోసం కాదు.. ప్రజా సేవ కోసం. పేదల కష్టాల్లో అండగా నిలవడం, కార్యకర్తల సమస్యల్లో తోడుగా ఉండడం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పోరాడడం ఆయన ప్రత్యేకత” అని అన్నారు.
బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేయడంలో డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే నాయకుడి జన్మదినాన్ని రోగులకు పండ్లు పంపిణీ చేసి, సేవా కార్యక్రమంతో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆరే రవీందర్ తెలిపారు.డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి కి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి, మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే శక్తిని అందించాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నరసయ్య, ముచ్కూరు సర్పంచ్ కోడిగేల శ్రీనివాస్, కుప్కల్ సర్పంచ్ నర్సింగరావు, ఉప సర్పంచ్ ప్యాట్ల రాజేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు తోట గంగాధర్, బీజేవైఎం అధ్యక్షుడు ప్రేమ్ చంద్, మండల ప్రధాన కార్యదర్శి పల్లికొండ ప్రసాద్,ఉపాధ్యక్షులు గొపరి లక్ష్మీనారాయణ,సీనియర్ నాయకులు కొట్టాల అశోక్, బద్దం సంజయ్, ధర్పల్లి మహిపాల్, రాజ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, మండల పదాధికారులు, కార్యకర్తలు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper