బాధిత కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ “మనాల”

పయనించే సూర్యుడు 30 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఏర్గట్ల మండల కేంద్రంలో గురువారం రోజున రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు ఆత్మీయ బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన బద్దం లింగారెడ్డి తండ్రి బద్దం గంగారెడ్డి . మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి,లింగారెడ్డి సహా కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.మరియు కల్లెడ పూరషోత్తం, వల్ల నానమ్మ ఇటీవలే మరణించడం తో వారి కుటుంబాన్ని కూడా పరమశించారు
ఈ పరామర్శ సమయంలో మనాల వెంట రెండ్ల రమేష్,నాగేంద్ర నగర్ సర్పంచ్, రంజిత్, రవి రెడ్డీ, అశ్వాక్ బాయ్, ఎండీ మునీర్,బలే శ్రీనివాస్,రఫీ, సంజీవ్,దొబ్బల మహేష్, జంగల గణేష్,రాకేష్,నందు, తదితరులు పాల్గొన్నారు.