PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఘటన

పయనించే సూర్యుడు న్యూస్ :ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. హనుక్కా వేడుకల కోసం వందలాది యూదు కుటుంబాలు బీచ్‌లో ఉన్న సమయంలో తండ్రీకొడుకులైన సాజిద్, నవీద్ జరిపిన కాల్పులలో 16 మంది చనిపోయారు. మరో 25 మంది గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి కారు డాష్‌క్యామ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో బోరిస్, సోఫియా గుర్మన్ అనే వృద్ధ దంపతులు ప్రాణాలకు […]

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

మ్యాచ్‌లపై ప్రకృతి ప్రభావం.. గాలి కారణంగా ఆట నిలిచిన ఘటన

పయనించే సూర్యుడు న్యూస్ :భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఉత్కంఠగా సాగుతున్న తరుణంలో లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ రద్దు కావడం క్రికెట్ వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది. సాధారణంగా వర్షం లేదా వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌లు ప్రభావితమవుతాయి.. కానీ లక్నోలోని ఇస్నా స్టేడియంలో దట్టమైన పొగమంచు, విజిబిలిటీ లోపం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే మ్యాచ్ రద్దయింది. ఆ రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా ప్రమాదకర స్థాయిలో ఉండటం

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

సరిహద్దుల్లో చైనా కదలికలు.. భారత్ భద్రతపై సంచలన నివేదిక

పయనించే సూర్యుడు న్యూస్ :భారత్‌లో మతోన్మాదం, ఉగ్రవాదం ద్వారా విధ్వంసాలు సృష్టించాలన్నది పాక్ పన్నాగమైతే.. భారత సరిహద్దు దేశాల్లో తమ సైనిక స్థావరాలు నిర్మించుకుంటూ.. అష్ట దిగ్బంధం చేయడమే లక్ష్యంగా చైనా దుష్ట పన్నాగాలు బయటపడుతున్నాయి. మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటి భారత సరిహద్దు దేశాల్లో ఈ మధ్యకాలంలో చెలరేగిన హింసాత్మక ప్రజాందోళనల వెనుక చైనా ఉందన్న విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. ఆయా దేశాల్లో తమకు అనుకూలమైన ప్రభుత్వాలను నెలకొల్పడం కోసం చైనా ఈ

వైరల్ న్యూస్

ఇంటి వద్ద నీరు తోడుతుండగా షాక్.. స్థానికుల్లో కలకలం

పయనించే సూర్యుడు న్యూస్ :పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భారీ కొండచిలువ ప్రత్యక్షం అయ్యింది. యనమదుర్రు డ్రైన్ నుంచి పంట చేలుకు నీరు తోడుతుండగా బయటకు వచ్చింది ఈ భారీ కొండచిలువ. పన్నెండు అడుగుల పైనే ఉన్న కొండచిలువను చూసి స్థానికులు భయపడ్డారు. అక్కడి నుంచి పరుగులు తీసారు. యనమదుర్రు కాలువ నీటిని తోడేందుకు ఏర్పాటు చేసిన ట్యాంక్ లోపలికి వెళ్ళింది కొండచిలువ. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో పనిచేసే మనుషులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులకు దైర్యం

వైరల్ న్యూస్

ప్రేమ వ్యవహారంలో మతమార్పిడి చేసిన యువకుడి అరెస్ట్

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రేమ గుడ్డిది అని.. ఊరికే అనలేదు. కొన్ని ఘటనలే దానికి నిదర్శనం. కొంతమంది ప్రేమించిన వారి కోసం ఏం చేయడానికైన వెనుకాడరు. అలాగే ఓ యువకుడు తన ప్రేమించిన అమ్మాయి కోసం ఏకంగా మతం మార్చుకున్నాడు. కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి దక్కకపోగా. జైలు పాలయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ అనే యువకుడు.. గోర్లవాండ్లపల్లికి చెందిన ముస్లిం యువతిని ప్రేమించాడు. తమ పెళ్ళికి మతం అడ్డొస్తుందని. మతం మారితే

Scroll to Top