Sunday, August 24, 2025
Homeఆంధ్రప్రదేశ్పురపాలక సంఘంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమo

పురపాలక సంఘంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమo

Listen to this article

పయని0చి సూర్యుడు ఆగస్టు 23 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం లో భాగంగా ఈరోజు తేదీ. 23-08-2025న సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు .. వర్షాకాల పరిశుభ్రత .అనే కార్యక్రము నిర్వహించడం జరిగింది. సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో గల అన్ని వార్డులలో గల మురికి కాలువలు యందు ఆయిల్ బాల్స్ వేసి మలాథియన్ స్ప్రేయింగ్ చేయించుట జరిగినది. పట్టణ వీధుల యందు వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో భాగముగా స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో, షార్ రోడ్డు సూళ్లూరుపేట నందు విద్యార్థులుచే ప్రతిజ్ఞ చేయించారు మరియు సూళ్లూరుపేట పురపాలక సంఘం కమిషనర్ కె.చిన్నయ , సదరు కార్యక్రమమును ఉద్దేశించి వర్షాకాలం నందు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు పరిసరాల పరిశుభ్రత గురించి వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, వార్డు ఎన్విరాన్మెంట్ అండ్ శానిటేషన్ సెక్రటరీలు, మున్సిపల్ సిబ్బంది, శానిటరీ మేస్త్రీలు మరియు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments