మాలల రణభేరి మహాసభ కరపత్రాలు ఆవిష్కరణ
ఈనెల 23- 11- 2025 నాడు సరూర్నగర్ స్టేడియంలో జరిగే మాలల రణభేరి మహాసభను విజయవంతం చేయండి
మహేష్ మాల మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి
( లోకల్ గైడ్ షాద్ నగర్ )
ఈరోజు కొందుర్గు మండల్ రేగడి చిల్కమర్రి ,ముటుపూర్,టేకులపల్లి.ఉమ్మెంతలా,లాలాపేట్, కొందుర్గ, తంగాలపల్లి,చౌదర్ గూడెం, తూంపల్లి. జిల్లేడు.గ్రామంలో మాల మహానాడు ఆధ్వర్యంలో మాలల రణభేరి మహాసభ కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ దేశంలో మనువాద పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా దళితులను విభజించి మన ఐక్యతను తీర్చే రాజాధికారం కి దూరం చేసే కుట్రనే
సుప్రీంకోర్టు సూచనలను విరుద్ధంగా 2011 జనాభా లెక్కలతో సరైన ఎంప్లాయికల్ డేటా లేకుండా కులాల వారిగా చేసిన ఎస్ వర్గీకరణ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి మరియు రోస్టర్ పాయింట్ కేటాయింపులను పునర్ సమీకరించి జీవో 99 ను సంహరించి మాలలతో గ్రూప్ 3 లో ఉన్న మరో 25 కులాలకు న్యాయం చేయాలి చేవెళ్లే డిక్లరేషన్ ప్రకారం ప్రస్తుతం జనాభా అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్ వెంటనే పెంచాలి పెండింగ్ లో ఉన్న ఎస్సీ విద్యార్థుల స్కాలర్ షిప్లను వెంటనే విడుదల చేయాలి మాల కార్పొరేషన్ ఏర్పాటుచేసి వెయ్యి కోట్ల మంది కేటాయించాలి కృషి ఎస్సీ సప్లై నిధులపై శ్వేత పత్రాన్ని విడుదల చేసి నిధులను ఖర్చు చేయాలని అధికారుల పైన చర్యలు తీసుకోవాలి కోరారు మాలల రణభేరి కార్యక్రమానికి షాద్ నగర్ నియోజకవర్గంలోని మాల ఉద్యోగులు మాల మహానాడు నాయకులు మేధావులు కార్యకర్తలు విద్యార్థులు కవులు కళాకారులు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయగలరు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఫరూక్నగర్ మండల అధ్యక్షుడు శేఖర్ షాద్నగర్ మున్సిపాలిటీ టౌన్ ప్రెసిడెంట్ శీను కొందరు మండల్ ప్రెసిడెంట్ ప్రవీణ్ షాద్నగర్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మల్లేష్ రవీందర్ కృష్ణ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
