PS Telugu News
Epaper

ఏర్గట్ల మండలం భట్టాపూర్ గ్రామంలో అక్రమ ఇసుక రవాణా డంపును సీజ్ చేసిన పోలీస్ రెవెన్యూ సిబ్బంది

📅 21 Nov 2025 ⏱️ 6:55 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండల కేంద్రంలో

మండలంలో అక్రమ ఇసుక రవాణా నిరోధించుటకు గాను, రెవెన్యూ మరియు పోలీసు సిబ్బంది భట్టాపూర్ గ్రామంలో తిరుగుచుండగా రూపాల బండ ప్రాంతంలో (14) ట్రాక్టర్ల అక్రమంగా నిలువచేసిన ఇసుక డంపును గుర్తించి సీజ్ చేయడం జరిగింది.ఇట్టి సీజ్ చేసిన (14) ట్రాక్టర్ల ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా సరఫరా చేయడం జరిగినది.మండలంలో ఎవరైనా ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేసినట్లయితే, వాహనాలు సీజ్ చేసి, వాహనాలు, ఓనర్లు మరియు డ్రైవర్లపై కేసులు చేయడం జరుగుతుందని, ఇందుమూలముగా తెలియజేయడమైనది.

Scroll to Top