అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు
*ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ .
మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్..
కాంగ్రెస్ పార్టీ ఫరూక్ నగర్ మండల
అధ్యక్షులు రాయికల్ శ్రీనివాస్…
*5 వార్డు కౌన్సిలర్ సింగపాగ శిరీష అనిల్ కుమార్….
షాద్నగర్ మున్సిపల్ 5 వ వార్డులో లబ్ధిదారుడు వల్త్యా చంది నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం*
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 4 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 5 వార్డులో లబ్ధిదారుడు వల్త్యా చందినిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ హాజరై రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారుడితో గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.నిరుపేదల సంక్షేమం దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకువచ్చిందని, ఈ పథకం ద్వారా అనేక మంది పేదలు సంతోషంగా జీవనం సాగిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా లబ్ధిపొందిన కుటుంబాలకు గౌరవప్రదమైన నివాస సౌకర్యం కల్పించడం జరుగుతోంది అని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అనే కలను నిజం చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఎంతో మంది నిరాశ్రయులకు స్థిర నివాసం లభిస్తోంది. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని” తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చి తీరుతామని భరోసా ఇచ్చారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అనే కలను నిజం చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఎంతో మంది నిరాశ్రయులకు స్థిర నివాసం లభిస్తోంది. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని” తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చి తీరుతామని భరోసా ఇచ్చారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలు మాట్లాడుతూ నాకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి కి , స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సోలిపూర్ నేతలు వెంకటేశ్వరరావు, సింగపాగ లక్ష్మయ్య మాజీ వార్డు సభ్యులు, సింగపాగ జంగయ్య, రవి, బాబు నాయక్, సోమ్లా నాయక్, రాజు నాయక్, రెడ్యా నాయక్, హనుమంతు, వెంకటేష్, శంకర్, శేఖర్, సాయి, కిషోర్, రాజు, నవీన్, రాహుల్, అన్నారం సర్పంచ్ రామకృష్ణ పాల్గొన్నారు.