భైంసా మండలంలోని సిద్దూర్ , గ్రామంలో మహిళా సమాఖ్య సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ నిర్వహించి, పనులను ప్రారంభించారు.
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, విద్యా రంగం మరియు మహిళా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు..ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచ్ , వార్డ్ సభ్యులు, మరియు, ఏపీవో, ఎంపీ ఓ,మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




