ఎరుగట్ల మండలంలో పల్స్ పోలియో అవగాహన సదస్సు .
పయనించే సూర్యుడుD.27.06.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండల కేంద్రంలో ఈరోజు శనివారం రోజున ఏరగట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రక్షిత మేడం పల్స్ పోలియో గురించి అంగన్వాడీలకు ఆశలకు ఏఎన్ఎం లకు 0 to 5 years పిల్లలకు రెండు చుక్కల డ్రాప్స్ వేయాలని ఈ డ్రాప్స్ వేయడం వల్ల పోలి రాకుండా ఉంటుంది కాబట్టి తప్పకుండా వేయించ గలరు అని సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో టామ్ టామ్ చేయించగలరని సర్పంచులకు కలిసి మరియు ప్రజలకు అవగాహన కల్పించి ప్రోగ్రాం సక్సెస్ చేయగలరని డాక్టర్ సూచించారు .ఇందులో పి హెచ్ ఎన్ ఇందిరా సబ్ యూనిట్ ఆఫీసర్ సూపర్వైజర్ విజయ హెల్త్ అసిస్టెంట్ చాట్ల పండరి గుండమోహన్ ఏఎన్ఎం వంశీ లు కల్పన శ్యామల సుమలత వీణ రాజహంస ఆస్మా మహేశ్వరి స్వప్న మరియు అంగన్వాడి కార్యకర్తలు ఆశలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు